పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తాజాగా 424 మంది భద్రతను ఉపసంహరిస్తునట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. భద్రతను రద్దు చేసిన 424 మంది వీఐపీల్లో మత పెద్దలు, రాజకీయ నాయకులు, రిటైర్డ్ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు వారికీ సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని స్పెషల్ డీజీపీకి రిపోర్ట్ చేయాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. కాగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సహా 184 మంది భద్రతను తగ్గించడం లేదా ఉపసంహరిస్తూ భగవంత్ మాన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతోనే 400 కు పైగా సిబ్బంది తిరిగి స్టేషన్స్ కు చేరుకునట్టు తెలిపారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇప్పటికే రాష్ట్రంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలకు ఒకే పదవీకాలానికి పింఛన్ అందజేయడం, అవినీతి నిరోధక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం, అవినీతి ఆరోపణలు రావడంతోనే తన కేబినెట్ మంత్రి డాక్టర్ విజయ్ సింగ్లా పదవి నుంచి బర్తరఫ్ చేయడం, జూలై 1వ తేదీ నుండి రాష్ట్రంలో ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనున్నట్లు ప్రకటించడం, తాజాగా వీఐపీల భద్రతను ఉపసంహరించుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF