ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9544 కరోనా పాజిటివ్ కేసులు, 91 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9544 కేసులతో కలిపి ఆగస్టు 21, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 3,34,940 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 55010 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన చిత్తూరులో పదహారు మంది, పశ్చిమగోదావరిలో పదమూడు మంది, నెల్లూరులో పన్నెండు మంది, తూర్పుగోదావరిలో పదకొండు మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, కడపలో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3092 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 2,44,045 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 8827 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 87803 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu