తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాలకు వినియోగించే బ్యాటరీల తయారీ యూనిట్ను నెలకొల్పడానికి ప్రముఖ సంస్థ ‘అమరరాజా గ్రూప్’ భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. రూ.9,500 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రి కేటీఆర్ సమక్షంలో నిన్న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దశాబ్దాల అనుభవం కలిగిన అమరరాజా గ్రూప్ తెలంగాణకు తరలి వెళ్లడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరేనని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
శనివారం విశాఖపట్నంలో మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం జరుగుతోందని, దీనివెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంటున్న మీడియా సంస్థలు ఉన్నాయని మండిపడ్డారు. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో ఆయా కంపెనీలు నిర్ణయించుకుంటాయని, దీనిలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుందని మండిపడ్డారు. మన రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టకూడదా? అలా చేస్తే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినట్లా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలా సహకరిస్తుందని, కొత్తగా పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఎన్నో రాయితీలు ప్రకటిస్తున్నామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE