భారత సంతతికి చెందిన మాజీ ఛాన్సలర్ రిషి సునాక్ మరోసారి బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో నిలిచారు. గత కొన్ని నెలల క్రితం బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ‘లిజ్ ట్రస్’ ప్రధాని పీఠమెక్కడం, కేవలం 45 రోజులకే అనుకోని పరిస్థితుల వల్ల పదవికి రాజినామా చేయడం వరుసగా జారిపోయాయి. అయితే ఆ ఎన్నికల్లో లిజ్ ట్రస్ తో పోటీ పది చివరి వరకు రేసులో నిలిచిన రిషి సునాక్ ఇప్పుడు మరోసారి ప్రధాని పదవి అందుకోవడానికి రేసులో ముందు వరుసలో నిలిచారు. ఈ క్రమంలో పోటీదారుల షార్ట్లిస్ట్లో చేరేందుకు అవసరమైన 100 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు కూడగట్టుకున్నారు. ఈ మేరకు ఆయనకు 100 మంది ఎంపీల మద్దతు ఇస్తున్నారని సునాక్ మద్దతుదారులు శనివారం పేర్కొన్నారు.
అయితే ఇదిలా ఉండగా మరోవైపు మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పోటీలో నిలవడానికి తన కరేబియన్ పర్యటన నుండి తిరిగి రావడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి. కాగా ఇటు రిషి సునాక్ కానీ అటు జాన్సన్ కానీ ప్రధాని ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశ్యాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. కామన్స్ లీడర్ ‘పెన్నీ మోర్డాంట్’ మాత్రమే తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిన ఏకైక అభ్యర్థి కావడం విశేషం. ఇక మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సునాక్, జాన్సన్ మరియు పెన్నీ మధ్య త్రిముఖ పోటీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY