పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదర్ పూనావాలా “వై కేటగిరీ” భద్రత కల్పిస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆయనకు వై కేటగిరీ భద్రత అమల్లో ఉండనుంది. వై కేటగిరీ కింద ఒకరు లేదా ఇద్దరు కమాండోలతో పాటుగా మొత్తం 11 మంది పోలీసు సిబ్బంది ఆయనకు భద్రతగా ఉండనున్నారు.
ముందుగా సీరం ఇన్స్టిట్యూట్ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ తమ సీఈవో అదర్ పూనావాలాకు భద్రత కోరుతూ ఏప్రిల్ 16న కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి పూనావాలాకు వివిధ గ్రూపుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆ లేఖలో సింగ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోమ్ శాఖ సీఈవో అదర్ పూనావాలాకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ