షిర్డీలోని సాయిబాబా ఆలయానికి 6.6 కోట్ల భారీగా విరాళాలు అందాయి. వరుసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులతో.. షిర్డీలోని ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు సాయి దర్శనార్ధం పెద్దసంఖ్యలో వచ్చారు. దీంతో.. సాయి సంస్థాన్కు రూ.6.68 కోట్ల ఆదాయం వచ్చింది. సాయిబాబా ఆలయం ఆవరణలో, సమాధి మందిరంలో ఏర్పాటు చేసిన హుండీలలో.. భక్తులు కానుకల రూపంలో సమర్పించుకుంటుంటారు. ఇలా వచ్చిన కానుకలను సంస్థాన్ అధికారులు బుధవారం లెక్కించారు.
అందులో.. నగదు, బంగారు, వెండి కానుకల రూపంలో ఆలయానికి మొత్తం రూ.6.68 కోట్లు విరాళాలుగా అందాయి. ఇందులో రూ.26.22 లక్షలు విలువగల పలు రకాల బంగారు ఆభరణాలు ఉండటం విశేషం. ఇంకా, రూ.1.07 లక్షలు విలువచేసే వెండి నగలు కూడా ఉన్నాయి. అయితే, షిర్డీ లో అక్కడక్కడ ఏర్పాటు చేసిన విరాళాలు స్వీకరించే కౌంటర్లలో వచ్చే నగదు, అన్లైన్లో దాతలు పంపిన నగదు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం ఇంకా పెరిగే అవకాశాలున్నాయని ట్రస్ట్ అధికారులు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ