టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ నుంచి తప్పించుకుంటున్నా. కానీ, ఈ రోజు మాత్రం అలా చేయలేకపోయాను. కరోనా బారినుంచి తప్పించుకోలేకపోయాను అని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. సాధారణ జలుబు వలే మనందరికీ వస్తుంది. మనం చేయాల్సిందల్లా మన రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. తద్వారా.. వైరస్తో పోరాడటానికి మన శరీరం బలంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి.. మీ మనస్సు మరియు శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం మర్చిపోవద్దు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడున్నా సరే మాస్కుని ధరించటం మర్చిపోకండి. అందరం ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉందాం అని చెప్పారు మంచు లక్ష్మి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ