ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోలతో పాటు హిందూ దేవతలైన లక్ష్మి మరియు గణేష్ ఫోటోలను చేర్చాలని సూచించారు. మన కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేష్ దేవుళ్ళ ఫోటోలు ఉంటే మన దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కరెన్సీ నోట్లను పూర్తిగా మార్చమని కోరడం లేదని, అయితే సంపద మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉన్న లక్ష్మి, గణేష్ వంటి ఇద్దరు దేవుళ్ళ ఫొటోలను కొత్త నోట్లలో చేర్చాలని అభ్యర్థిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశంలో ప్రతిరోజూ కొత్త కరెన్సీ నోట్లు ముద్రించబడుతున్న నేపథ్యంలో దేవుళ్ళ ఫోటోలను అప్పుడు చేర్చవచ్చని అన్నారు.
బుధవారం ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ లో సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లో దీపావళి పూజ చేస్తున్నప్పుడు తనకు ఈ అంశంపై ఆలోచన వచ్చిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని, దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అందుకోసం చాలా కృషి చేయాలన్నారు. ఈ క్రమంలో దేవతల అనుగ్రహం కూడా మనపై ఉన్నప్పుడే అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయన్నారు. అందుకే దేశంలో కరెన్సీ నోట్లపై ఒకవైపు గాంధీజీ బొమ్మను అలాగే ఉంచి, లక్ష్మీ, గణేష్ చిత్రాలను చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా ముస్లిం మెజారిటీ దేశం అని, కేవలం 2 నుంచి 3 శాతం హిందువులు మాత్రమే ఉంటారని, ఆదేశంలో కరెన్సీపై గణేష్ ఫోటో ఉందని చెప్పారు. ఇండోనేషియా దేవుళ్ళ ఫోటోలను చేర్చినపుడు మనం ఎందుకు చేయలేమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY