సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాడులో కీలక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆయన పార్టీ ప్రకటన, రాజకీయ ప్రవేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల రజనీ మక్కళ్ మండ్రం (ఆర్ఎంఎం) సెక్రెటరీలతో స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో సోమవారం నాడు రజనీకాంత్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం పార్టీపై కీలక ప్రకటన వస్తుందని అభిమానులు, ప్రజలు ఆశించగా వారికీ మళ్ళీ నిరాశ తప్పలేదు. సెక్రెటరీలతో సమావేశం అనంతరం నటుడు రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. “ఈ సమావేశంలో జిల్లా సెక్రటరీలు, మరియు నేను ఒకరికొకరం అభిప్రాయాలను పంచుకున్నాం. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నాకు మద్దతు ఇస్తానని వారు హామీ ఇచ్చారు. రాజకీయాలపై నేను వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటాను” రజనీకాంత్ పేర్కొన్నారు. మరోవైపు అతిత్వరలోనే రజనీకాంత్ తన పార్టీపై ప్రకటన చేసే అవకాశముందని, అలాగే సొంతంగా కాకుండా ఇతర పార్టీలతో పొత్తుతో వెళ్లే విషయాన్ని రజనీ మక్కళ్ మండ్రం సభ్యులు వ్యతిరేకించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ