కోవిడ్-19 మహమ్మారి నివారణకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, త్వరలో అందుబాటులోకి రానున్న కోవిడ్ వ్యాక్సిన్ పై రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఏర్పాట్లు, తదితర అంశాలపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌభా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను తూచా తప్పక అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో 4.5 లక్షలు యాక్టివ్ కేసులు ఉన్నాయని, మరణాల శాతం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాలలో కోవిడ్ నియంత్రణకు, కోవిడ్ పరీక్షలు పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాకు తీసుకుంటున్న చర్యలపై ప్రస్తావిస్తూ, కోవిడ్ వ్యాక్సిన్ ను సత్వరమే అందరికీ అందేలా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ నిల్వ కోసం కోల్డ్ చైన్ గుర్తించడం, వ్యాక్సిన్ రవాణా తదితర అంశాలపై సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ హోమ్ రవి గుప్తా, అదనపు డిజి జితేందర్, ప్రిన్సిపాల్ సెక్రటరీ పొలిటికల్ వికాస్ రాజ్, హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ