బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసును సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తులో భాగంగా ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా నుంచి సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోస్ట్మార్టం రిపోర్టును తాజాగా సీబీఐ అందుకుంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం సుశాంత్ సింగ్ శరీరంలో సేంద్రీయ విషం ఆనవాళ్లు కనుగొనబడలేదని పేర్కొన్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 7 న సుశాంత్ రాజ్పుత్ మృతదేహంలో విషం ఉందో లేదో తెలుసుకోవడానికి ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం విస్సెరా పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. డీఎన్ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పించినట్టు తెలిపారు.
అలాగే కూపర్ హాస్పిటల్ యొక్క నివేదికను కూడా ఎయిమ్స్ ఫోర్సెనిక్ బృందం విశ్లేషిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు సుశాంత్ సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, వివిధ కోణాల్లో పరిశీలన జరుగుతుందని సీబీఐ పేర్కొంది. ఇంతవరకు ఈ కేసులో ఏ కోణాన్ని, ఏ ఆరోపణనను తోసిపుచ్చలేదని, పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu