ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) మరియు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా క్యాంప్బెల్ విల్సన్ నియమితులయ్యారు. ఈ మేరకు టాటా సన్స్ సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సీఈవోగా క్యాంప్బెల్ విల్సన్ నియామకాన్ని ఎయిర్ ఇండియా బోర్డు ఆమోదించినట్టు తెలిపారు. సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన స్కూట్ సీఈవో అయిన విల్సన్ కు ఏవియేషన్ ఇండస్ట్రీలో 26 సంవత్సరాల అనుభవం ఉన్నట్టు తెలిపారు. టాటా సన్స్ అండ్ ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, ఎయిరిండియా సీఈవోగా విల్సన్ నియామకాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను నిర్మించడం కోసం అతనితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని అన్నారు.
ముందుగా టాటా గ్రూప్ బిడ్ గెలుచుకుని ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి దక్కించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం గత ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవోగా టర్కీ ఎయిర్లైన్స్ మాజీ సీఈవో ఇల్కర్ ఐసీని నియమించేందుకు బోర్డు ఆమోదం తెలుపగా, టాటాసన్స్ ప్రకటన చేసింది. అయితే అధికారికంగా బాధ్యతలు చేపట్టకముందే ఆ పదవీ స్వీకరించేందుకు నిరాకరిస్తునట్టు ఇల్కర్ ఐసీ ప్రకటించారు. ఆ నియామకం వివాదాస్పదం కావడంతో కొత్త సీఈవో కోసం టాటా గ్రూప్ కీలక సంప్రదింపులు జరిపింది. తాజాగా ఈ రంగంలో పలు ప్రపంచ మార్కెట్లలో పనిచేసిన అనుభవజ్ఞుడైన క్యాంప్బెల్ విల్సన్ ను సీఈవో గా నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF