టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ మహేంద్ర సింగ్ ధోని శనివారం తన అధికారిక పేస్ బుక్ అకౌంట్ ద్వారా కీలక అప్ డేట్ ఇచ్చాడు. “నేను సెప్టెంబర్ 25, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మీ అందరితో ఓ ఎక్సైటింగ్ న్యూస్ పంచుకుంటాను. మీ అందరినీ అక్కడ చూడాలని ఆశిస్తున్నాను” అని ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు. దీంతో ఆదివారం మధ్యాహ్నం పేస్ బుక్ లైవ్ లో ఎంఎస్ ధోని ఏం చెప్పబోతున్నాడనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకుంది.
సోషల్ మీడియాలో చాలా అరుదుగా పోస్టులు పెట్టే ధోనీ, తాజా పోస్ట్ తో మరోసారి అభిమానుల్లో ఉత్సుకత రేపాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ధోనీ తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. రేపు ధోని చెప్పబోయేది ఐపీఎల్ గురించా, భవిష్యత్ ప్రణాళికపైనా లేదా బిజినెస్ వ్యవహారమా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చల్లో మునిగారు. ధోని చెప్పే ఎక్సైటింగ్ న్యూస్ ఏంటో తెలియాలంటే సెప్టెంబరు 25, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు వేచిచూడాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY