టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అథ్లెట్ల అత్యుత్తమ ప్రదర్శన కొనసాగుతుంది. ముఖ్యంగా భారత్ షూటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. షూటర్లు మనీష్ నర్వాల్, సింఘ్ రాజ్ అదానా ఒకే ఈవెంట్ లో 2 పతకాలు సాధించారు. దీంతో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. శనివారం ఉదయం జరిగిన షూటింగ్ (మిక్సిడ్ 50m పిస్టోల్ SH1) ఫైనల్ లో మనీష్ నర్వాల్ స్వర్ణ పతకం సాధించగా, సింఘ్ రాజ్ అదానా రజతం గెలుచుకున్నాడు. ఇక సింఘ్ రాజ్ అదానా ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ ఈవెంట్ లో కూడా కాంస్యం సాధించి, ఒకే పారాలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన ఘనత సొంతం చేసుకున్నాడు. పారాలింపిక్స్-2020లో భారత్ పతకాల సంఖ్య 15 కు (మూడు స్వర్ణం, ఏడు రజతం, ఐదు కాంస్యాలు) చేరుకుంది. మరోవైపు బాడ్మింటన్ లో సుహాస్ యతిరాజ్, ప్రమోద్ భగత్ లు ఫైనల్స్ లోకి చేరి మరో రెండు పతకాలను ఖాయం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ