భారత పౌరులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ పర్ టెక్నీకల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) కీలక సూచన చేశాయి. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం పాకిస్తాన్ కు వెళ్లవద్దని సూచించాయి. ఈ మేరకు యూజీసీ, ఏఐసీటీఈ సంయుక్తంగా శుక్రవారం నాడు పబ్లిక్ నోటీస్ విడుదల చేశాయి. పాకిస్తాన్లోని ఏదైనా డిగ్రీ కళాశాల/విద్యా సంస్థలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే భారతీయ పౌరులు లేదా భారతదేశపు విదేశీ పౌరులు, పాకిస్తాన్లో పొందిన విద్యార్హతల (ఏదైనా సబ్జెక్ట్లో) ఆధారంగా భారతదేశంలో ఉద్యోగం పొందడానికి లేదా ఉన్నత చదువులు అభ్యసించడానికి అర్హులు కాదని పేర్కొన్నారు.
అయితే వలసదారులు మరియు వారి పిల్లలు పాకిస్తాన్ లో ఉన్నత విద్య డిగ్రీని పొంది, భారతదేశం ద్వారా పౌరసత్వం పొందిన వారు కేంద్ర హోమ్ శాఖ నుండి సెక్యూరిటీ క్లియరెన్స్ పొందిన తర్వాత భారతదేశంలో ఉపాధిని పొందేందుకు అర్హులని తెలిపారు. భారత విద్యార్థులు ఉన్నత విద్య కోసం పాకిస్తాన్ కు వెళ్లకుండా ఉండాలని, అక్కడ తీసుకున్న డిగ్రీకి భారత్ లో ఉన్నత విద్యకోసం గాని, ఉద్యోగం కోసం గాని అర్హతగా పరిగణించబడదని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ