దేశంలో కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. శుక్రవారం నాటికీ ఈ కేసుల సంఖ్య 82 గా ఉండగా, కొత్తగా ఒక్కరోజులోనే మరో 8 మందికి కొత్త రకం కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 90 కి చేరుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ గా తేలిన వారిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నాయి. వారి ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులను కూడా క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్తరకం కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఇటీవల యూకేలో రోజువారీగా 50 నుంచి 60 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. యూకేతో పాటుగా ఇప్పటివరకు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికా, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ సహా 40 కి పైగా దేశాల్లో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ