కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో చేరారు. ఇటీవలే అమిత్ షా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆగస్టు 14 వ తేదీన నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ గా వచ్చినట్టు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా అనంతరం చికిత్స (పోస్ట్ కోవిడ్ కేర్) కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. “హోంమంత్రి అమిత్ షా గత 3-4 రోజులుగా అలసట మరియు శరీర నొప్పుల ఉన్నట్లు చెబుతున్నారు. కోవిడ్-19 పరీక్షల్లో ఫలితం నెగటివ్ గా వచ్చింది. ఆయన ఆరోగ్యం గానే ఉన్నారు మరియు ఆసుపత్రి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు” అని ఎయిమ్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu