దేశంలో ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “కరోనా యొక్క ప్రారంభ లక్షణాలు కనిపించిన తరువాత, పరీక్ష చేయించుకోగా నివేదిక పాజిటివ్ గా వచ్చింది. వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్ లో ఉంటూ అన్ని కరోనా మార్గదర్శకాలను అనుసరిస్తున్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. గత కొన్ని రోజులుగా ఎవరైతే నన్ను సంప్రదించారో వారంతా దయచేసి ఇతరులతో వేరుగా ఉండి కరోనా పరీక్ష చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని అశ్వినీ కుమార్ చౌబే ట్వీట్ చేశారు.
మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అత్వాలే, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర ఉక్కు, ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కరోనా బారినపడి కోలుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ