కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన సతీమణి నౌనంద్ కన్వార్ తో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి గజేంద్ర సింగ్ షెకావత్ కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE