కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మే 31 న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష-2020ని వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే 2020 సంవత్సరానికి పరీక్షల షెడ్యూల్ ను జూన్ 5, శుక్రవారం నాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 4, 2020 న, మెయిన్స్ పరీక్షలను జనవరి 8, 2021 న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం దాదాపు 10 లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu