ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 9, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,44,864 కు, మరణాల సంఖ్య 6159 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 70,521 కరోనా పరీక్షలు నిర్వహించగా 5145 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 31 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన ప్రకాశంలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు, కర్నూల్ లో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరియు పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6159 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 6,91,040 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 6110 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 47665 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu