ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వివిధ విద్యా సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మంగళవారం ఉదయం సమీక్షించారు. ఉన్నత విద్యామండలి సెక్రటరీ కె.సంజయ్ మూర్తి న్యూఢిల్లీలోని ఉప-రాష్ట్రపతి నివాస్లో సంస్థల స్థితిగతులపై వెంకయ్య నాయుడుకు వివరించారు. “ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ-అనంతపురం, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-విజయనగరం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-తిరుపతి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)-తాడేపల్లిగూడెం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)-తిరుపతి, పెట్రోలియం యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ), ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ-గుంటూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్-కర్నూలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)-మంగళగిరి వంటి సంస్థల ఏర్పాటు మరియు నిర్వహణలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని సంజయ్ మూర్తి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి వివరించారు.
అలాగే నెల్లూరులో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు మరియు క్లాసికల్ తెలుగులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ నిర్వహణలో సాధించిన పురోగతిని కూడా ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. ముందుగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం వెంకయ్య నాయుడుతో సమావేశమై సంస్థల అంశంపై ఆయనకు వివరించారు. తదనంతరం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఉప-రాష్ట్రపతి నివాస్కు వచ్చి ఈ అంశంపై వివరణాత్మక ప్రదర్శనను అందించారు.
అలాగే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మరియు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యనాద్ రాయ్ కూడా మంగళవారం పార్లమెంట్ హౌస్లోని తన ఛాంబర్లో తమ మంత్రిత్వ శాఖల పరిధిలోని సంస్థల స్థితిగతుల గురించి వెంకయ్య నాయుడుకి వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలకు తీసుకెళ్లడంతోపాటు వాటిని పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం భారత ప్రభుత్వం విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర మరియు దేశంలోని ప్రజల పెద్ద ప్రయోజనం దృష్ట్యా ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి మరియు పూర్తి స్థాయి కార్యాచరణకు వెంకయ్య నాయుడు క్రమం తప్పకుండా వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY