అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ (డే/నైట్) లో స్పిన్నర్లు చెలరేగడంతో భారత్ జట్టు పట్టు బిగిస్తుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తోలి ఇన్నింగ్స్లో 112 పరుగులకే ఆలౌట్ అయింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అక్షర్ పటేల్ ఆరు వికెట్లతో రాణించడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. ఇంగ్లాండ్ జట్టులో జాక్ క్రాలీ ఒక్కడే 53 పరుగులు చేసాడు.
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇషాంత్ శర్మ బౌలింగ్ లో డామ్ సిబ్లి, అక్షర్ పటేల్ బౌలింగ్ లో జానీ బెయిర్స్టో డకౌట్ గా వెనుదిరిగారు. అనంతరం అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ను జాక్ క్రాలీ తప్ప ఇతర ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ఎవరూ సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. అక్షర్ పటేల్ ఆరు, అశ్విన్ మూడు, ఇషాంత్ ఒక వికెట్ పడగట్టారు. మరోవైపు తోలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తోలి రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (57), అజింక్య రహానే (1) క్రీజులో ఉన్నారు.
.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ