బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరపున జగదీప్ ధన్కర్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూలై 5న ప్రారంభం కాగా, జూలై 19తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్ ఈ రోజు పార్లమెంటులో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు కేబినెట్ మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులు పాల్గొన్నారు. 71 ఏళ్ల జగదీప్ ధన్కర్ రాజస్థాన్ బీజేపీలో కీలక పాత్ర పోషించారు. అలాగే మూడేళ్ళ నుంచి పశ్చిమబెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేశారు. ఉప రాష్ట్రపతి బరిలో నిలవడంతో పశ్చిమబెంగాల్ గవర్నర్ పదవీకి జగదీప్ ధన్కర్ ఆదివారం నాడు రాజీనామా చేశారు.
ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ అల్వాను కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాయి. మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ జరగనుండగా, అదేరోజున కౌంటింగ్ కూడా చేపట్టనున్నారు. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10, 2022తో ముగియనుంది. దీంతో ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY