తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్తో పాటుగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు వేశారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో పలు విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నిలిచిన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుండగా, ఇప్పటి వరకు మొత్తం 116 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినట్టు తెలుస్తుంది. తెలంగాణకు చెందిన 119 ఎమ్మెల్యేలతో పాటుగా ఏపీకి చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా తెలంగాణ శాసనసభలో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, ముందుగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా శాసనసభ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు జూలై 21వ తేదీన చేపట్టనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24, 2022 తో ముగియనుండడంతో, జూలై 25వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY