మాస్టర్ బ్లాస్టర్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం ఎంపిక చేయబడ్డ ముంబయి సీనియర్ టీమ్ లో చోటుదక్కలేదు. ముందుగా ప్రాక్టీస్ శిబిరం కోసం ఎంపిక చేసిన 104 మంది ముంబయి ఆటగాళ్ల జాబితాలో అర్జున్ టెండూల్కర్ ఉన్నప్పటికీ, తాజాగా ప్రకటించిన 22 మందితో కూడిన తుది జట్టులో చోటు దక్కలేదు. ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం తొలిసారిగా అర్జున్ టెండూల్కర్ ముంబయి జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఆ టోర్నీలో ఆశించినంతగా రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం అతన్ని ఎంపిక చేయనట్టుగా తెలుస్తుంది. మరోవైపు విజయ్ హజారే ట్రోఫీకి ముంబయి జట్టు కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు. అలాగే పృథ్వీ షాను వైస్ కెప్టెన్గా నియమించారు. బుధవారం నాడు మొత్తం 22 మంది సభ్యులతో కూడిన జట్టును ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
ముంబయి స్క్వాడ్:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, ఆదిత్య తారే, ధావల్ కులకర్ణి, తుషార్ దేశ్పాండే, అఖిల్ హెర్వాడ్కర్, చిన్మయ్ సుతార్, హార్దిక్ తమోర్, ఆకాష్ పార్కర్, అతిఫ్ అత్తర్ వాలా, షామ్స్ మూలని, సైరాజ్ పాటిల్, ఆతర్వా అంకోలేకర్, సుజిత్ నాయక్, తనూష్ కోటియన్, ప్రశాంత్ సోలంకి, మోహిత్ అవస్థీ, సిద్ధార్థ్ రౌత్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ