బీజేపీ సీనియర్ నేత, పూణే ఎంపీ గిరీష్ బాపట్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

PM Modi has Condoled the Passing Away of BJP Senior Leader Pune MP Girish Bapat,PM Modi has Condoled Pune MP Girish Bapat,BJP Senior Leader Pune MP Girish Bapat,Passing Away of BJP Senior Leader,Mango News,Mango News Telugu,PM Modi condoles death of BJP MP,Pune MP Girish Bapat passes away,BJP MP Girish Bapat Dies,Girish Bapat Latest News,Girish Bapat Illness Reason,MP Girish Bapat Latest Updates,Girish Bapat Passed Away Live Updates,BJP's face for four decades,Lok Sabha MP Girish Bapat passes away

బీజేపీ సీనియర్ నేత, పూణే లోక్ సభ ఎంపీ గిరీష్ బాపట్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “గిరీష్ బాపట్ జీ నిరాడంబరమైన మరియు కష్టపడి పనిచేసే నాయకుడు, సమాజానికి శ్రద్ధగా సేవ చేశారు. ఆయన మహారాష్ట్ర అభివృద్ధికి విస్తృతంగా పనిచేశాడు మరియు పూణే అభివృద్ధిపై ప్రత్యేకించి మక్కువ చూపారు. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

“మహారాష్ట్రలో బీజేపీ పార్టీని నిర్మించడంలో మరియు బలోపేతం చేయడంలో గిరీష్ బాపట్ జీ కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సంక్షేమ సమస్యలను లేవనెత్తారు. ఆయన సమర్థవంతమైన మంత్రిగా మరియు తరువాత పూణే ఎంపీగా కూడా తనదైన ముద్ర వేశారు. గిరీష్ బాపట్ చేసిన మంచి పని చాలా మందిని ప్రేరేపిస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్ బాపట్, దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కస్బాపేట్‌ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, 2019లో పూణే లోక్‌ సభ స్థానం నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. గిరీష్ బాపట్ మృతి పట్ల బీజేపీ, పలుపార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =