దేశవ్యాప్తంగా 2కోట్ల మందికి లబ్ది కలిగేలా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 85 జిల్లాల్లో 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వర్చువల్గా రిమోట్ ద్వారా వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘రేడియో మరియు ఎఫ్ఎమ్ విషయానికి వస్తే, దానితో నాకు ఉన్న సంబంధం ఉద్వేగభరితమైనది. నేడు ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) సేవ యొక్క విస్తరణలో భాగంగా ఆల్ ఇండియా ఎఫ్ఎం ప్రారంభించడం ఒక పెద్ద మరియు ముఖ్యమైన ముందడుగు. ఆల్ ఇండియా ఎఫ్ఎం యొక్క 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల యొక్క ప్రారంభం ఈ దేశంలోని 85 జిల్లాల్లో పరిధిలో గల సుమారు 2 కోట్ల మంది ప్రజలకు బహుమతి లాంటిది’ అని పేర్కొన్నారు.
ఇంకా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఇది చారిత్రాత్మక సందర్భం. వినోదం, క్రీడలు, వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులకు చేరవేయడంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది. సకాలంలో సమాచారం అందించడం, వ్యవసాయం కోసం వాతావరణ సూచనలు లేదా మహిళా స్వయం సహాయక బృందాలను కొత్త మార్కెట్లతో అనుసంధానించడం వంటివి ఈ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఎఫ్ఎం యొక్క ఇన్ఫోటైన్మెంట్కు చాలా విలువ ఉంది. మా ప్రభుత్వం దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో సాంకేతికతను అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తుంది. సాంకేతికత యొక్క ప్రజాస్వామ్యీకరణ దిశగా మా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రతి పౌరుడు ఆర్థిక స్థోమత మరియు ఆధునిక సాంకేతికతను పొందగలగాలి. ఆల్ ఇండియా రేడియోకు దేశాన్ని అనుసంధానం చేయాలనే దృక్పథం ఉంది. ప్రస్తుతం రేడియో అంతగా వాడుకలో లేదు. అయితే ఆన్లైన్ ఎఫ్ఎమ్లు మరియు పాడ్కాస్ట్ల ద్వారా ఇది సరికొత్త రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు డిజిటల్ ఇండియా కార్యక్రమం దీనికి కొత్త శ్రోతలను అందించింది’ అని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE