ఎవరితో పెళ్లి పీటలు ఎక్కాలని యువతి ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్ట్

Woman Speaking to 14 Men Through Matrimony Asks with Whom to Get Married The Post Gone Viral on Social Media,Woman Speaking to 14 Men Through Matrimony,Woman Speaking to 14 Men Whom to Get Married,Woman Speaking to 14 Men Post Gone Viral,Woman on Through Matrimony Gone Viral on Social Media,Mango News,Mango News Telugu,Who should marry among those 14 people,A young woman's question with whom to get married,The post has gone viral on social media,Woman Lists Salaries Of 14 Men,Confession of a woman speaking,Woman Seeks Help To Choose Right One,Unemployed BCom pass girl,Woman Asks Internet To Choose Right One,Woman talking to 14 men via matrimony,Woman Speaking to 14 Men Latest News,Woman Speaking to 14 Men Latest Updates

అమ్మాయి పెళ్లీడుకి వచ్చిందంటే చాలు.. తల్లిదండ్రులు సరైన అబ్బాయి కోసం వెతకడం మొదలుపెడతారు. దీనికోసం తెలిసిన వారి ద్వారా, బ్రోకర్ల ద్వారా రకరకాల సంబంధాలను చూస్తుంటారు. కుమార్తెకు తగిన వరుడు కోసం మ్యాట్రిమోనీలను సైతం ఆశ్రయిస్తారు. ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులతో సంబంధం లేకుండానే యువతి యువకులు మ్యాట్రిమోనీలలో తమకు తగిన జత కోసం వెతుక్కుంటున్నారు. అలా ఓ యువతి.. వరుడు ఎంపికకు సంబంధించి చేసిన పోస్టు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరంగా మారింది.

29 ఏళ్ల యువతి సోషల్ మీడియాలో చేసిన పోస్టు.. ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆమె పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లతో ఉత్సాహంగా స్పందిస్తున్నారు. బీకామ్ చదువుకున్న ఆ అమ్మాయి.. ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయట్లేదట. పెళ్లి కోసం ఓ ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ను ఆశ్రయించింది. అందులో తన వివరాలు మొత్తం నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఆమె అభిరుచికి తగ్గట్లు 14 మంది ప్రొఫైల్స్ సరిపోలాయి. దీంతో వారితో ఆమె పరిచయం పెంచుకుంది. ఆ 14 మందిలో ఎవర్ని మనువాడాలని తెగ మదనపడిపోతుందట.

ఎవరితో మూడు ముళ్లు వేపించుకోవాలనేది అర్థం కావట్లేదని.. పోస్ట్ పెట్టింది. @TheSquind అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆ యువతి తన పోస్టును షేర్ చేసుకుంది. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయిన 14 మంది అబ్బాయిలతో తాను మాట్లాడుతున్నానని.. అయితే వారిలో ఎవరితో పెళ్లిపీటలు ఎక్కాలనేది తేల్చుకోలేకపోతున్నానని.. ఏం చేయాలో దిక్కు తోచట్లేదంటూ పోస్టు చేసింది. దాంతో పాటు తనకు పరిచయం అయిన 14 అబ్బాయిలు పని చేసే సంస్థ అలాగే వారి జీతాల వివరాలు అందులో తెలిపింది. పోస్టులో పెట్టిన దాన్ని బట్టి చూస్తే.. వారంతా ఏడాదికి 14 లక్షల నుంచి 45 లక్షల వరకు సంపాదించే వారే ఉన్నారు. అందులో చాలా మంది ఫ్లిప్ కార్ట్, బైజూస్, టీసీఎస్, డెలాయిట్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేస్తున్నారు.

ఇక ఆ యువతి పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక్కో నెటిజన్ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. డిగ్రీ చదివిన మీరు ఉద్యోగం చేయట్లేదు కదా.. వారిలో ఒకర్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందిగా అని ఒకరు కామెంట్ చేయగా.. ఇలా వివాహ వేదికల ద్వారా అమ్మాయిలు అబ్బాయిల మధ్య పరిచయం ఏర్పడం కామనే అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే మాటల ద్వారా వారిలోని నిజాయతీని గుర్తించాలని అంటున్నారు. ఏది ఎలా ఉన్న ఒక అమ్మాయి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ధైర్యంగా ముందుకొచ్చి సలహా అగడటం అభినందించదగిన విషయం అని చాలామంది ఆమెను ప్రశంసిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =