ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు (జూన్ 5, ఆదివారం) ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సేవ్ సాయిల్ మూవ్మెంట్ (మట్టిని రక్షించు అనే ప్రపంచ ఉద్యమం) పై జరిగే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
‘సేవ్ సాయిల్ మూవ్మెంట్’ అనేది నేల ఆరోగ్యం క్షీణించడం గురించి అవగాహన పెంచడం మరియు దానిని మెరుగుపరిచేలా ప్రతిస్పందనను తీసుకురావడానికి జరుగుతున్న ప్రపంచవ్యాప్త ఉద్యమం. 27 దేశాల గుండా 100 రోజుల మోటార్ సైకిల్ ప్రయాణం చేపడుతున్న సద్గురు మార్చి 2022లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. జూన్ 5వ తేదీ సద్గురు 100 రోజుల ప్రయాణంలో 75వ రోజు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడం ద్వారా దేశంలోని నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం నిబద్ధతకు ప్రతిబింబంగా ఉంటుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF