మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ ముందు విచారణకు హాజరనున్నారు. కాగా శుక్రవారం ఎంపీ అవినాష్ రెడ్డి రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. కాగా నేడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధిఅక్రూలు విచారణ చేయనున్నారు. ఇక ఇంతకుముందు భాస్కర్ రెడ్డికి సీబీఐ ఈనెల 18వ తేదీన నోటీసులు ఇచ్చి 23వ తేదీన విచారణ కోసం రావాల్సిందిగా కోరింది. అయితే భాస్కర్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. తనకు వ్యక్తిగత పనులు ఉన్నాయని, ఆరోజు విచారణకు హాజరు కాలేనని, 24 తర్వాత రాగలనని సీబీఐకి తెలిపారు. దీంతో సీబీఐ ఆయన విచారణకు మరో తేదీ ప్రకటిస్తామని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో గడువు ప్రకారం 25న అంటే నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో భాస్కర్ రెడ్డి సీబీఐ నుంచి ఈరోజు విచారణకు రమ్మని తనకు ఎలాంటి నోటీసూ రాలేదని, గతంలో నోటీసు ఇచ్చిన సందర్భంలో 24 తరువాత అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చానని చెప్పారు. నేటి విచారణ విషయమై మీడియాలో చూశానని, సీబీఐకి సహకరిస్తానని, ఈరోజు కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్లో విచారణకు సీబీఐ వద్దకు వస్తానని వైఎస్ భాస్కర్ రెడ్డి వెల్లడించారు. అయితే మరోవైపు ఈ రోజు విచారణ కోసం కడప సెంట్రల్ జైలు కేంద్రం వద్ద హాజరుకావాలని భాస్కర్ రెడ్డి సెల్ఫోన్ వాట్సాప్కు నిన్న నోటీసులు పంపామని సీబీఐ అధికారులు తెలిపారు. దీంతో కడప పట్టణంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE