తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు (ఆగస్టు 12, శుక్రవారం) విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు టీఎస్ ఎంసెట్-2022 ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్స్ ఫలితాలను కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఫలితాలను అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.in లో అందుబాటులో ఉంచనున్నారు. కాగా జూలై 18, 19, 20 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలకు 1,56,812 మంది హాజరుకాగా, జూలై 30, 31వ తేదీల్లో జరిగిన అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలకు 80,575 మంది విద్యార్థులు హాజరయ్యారు.
మరోవైపు రేపు ఉదయం 11.45 గంటలకు టీఎస్ ఈసెట్-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలను కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఈసెట్-2022 పరీక్షను ఆగస్టు 1వ తేదీన నిర్వహించారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం డిప్లొమా, బీఎస్సి మాథెమాటిక్స్ విద్యార్దులకు ఈసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ /బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలోకి రెగ్యులర్ ప్రవేశాలు కల్పిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY