కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఏప్రిల్ 3, శుక్రవారం నాడు లైవ్ సెషన్ నిర్వహించి కరోనా వైరస్ గురించి, లాక్డౌన్ సమయంలో పాటించాల్సిన పలు జాగ్రత్తలును ప్రజలు, అభిమానులకు తెలియజేశారు. లాక్డౌన్ సందర్భంగా దొరికిన ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి?, సైకాలాజికల్ గా ఎలా ఉండాలి?, కుటుంబంతో ఎలా మసలుకోవాలి? వంటి విషయాలతో పాటుగా మరిన్ని ఆసక్తిర అంశాల గురించి మాట్లాడారు. ఈ ప్రతికూల సమయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ, తన వంతుగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా మరికొన్ని లైవ్ సెషన్స్ నిర్వహించాలని బీవీ పట్టాభిరామ్ గారు నిర్ణయించుకున్నారు.
బీవీ పట్టాభిరామ్ గారి లైవ్ సెషన్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]