శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 184వ పాఠంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు, విక్టరీ వెంకటేష్, ప్రముఖ నటి మీనా ప్రధాన పాత్రల్లో నటించిన “దృశ్యం-2” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమాలో ఎలిమెంట్ ఆఫ్ ఇంటరెస్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పారు. ఈ సస్పెన్స్ థిల్లర్ లో నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు ప్రతిభ, సన్నివేశాల రూపకల్పన గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇