తెలంగాణ లోని ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాయనున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు తేదీని జూలై 8 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఇటీవలి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించొచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు ఇప్పటికే ప్రకటించింది.
ఈ క్రమంలో ఉదయం పూట ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గం. నుంచి 12 గం. వరకు ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, మధ్యాహ్నం 2:30 గం. నుంచి సాయంత్రం 5-30 గం. వరకు సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ జూలై 22వ తేదీన, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూలై 23న జరుగనున్నాయి. ఈ రెండు పరీక్షలు ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు నిర్వహిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ