ఈ రోజు న్యూజిలాండ్ తో రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. గత 2,3 రోజులుగా ముంబైలో వర్షం కురుస్తున్న కారణంగా వాంఖడే గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ తడిగా మారింది. దీంతో 9 గంటలకు వేయాల్సిన టాస్ ను అంపైర్లు వాయిదా వేశారు. లంచ్ సమయానికి పరిస్థితి అదుపులోకి రావడంతో టాస్ వేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచున్నాడు. కాగా, కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఈ మ్యాచ్ కి దూరం అవటంతో టామ్ లాథమ్ సారధిగా వ్యవహరించనున్నాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ అనూహ్య మలుపులతో డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. ఒక్క వికెట్ దూరంలో టీమిండియా గెలుపు వాకిట నిలిచిపోయింది.
భారత జట్టు: శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, డారెల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్, టిం సౌథీ, విలియం సోమర్ విలే, అజాజ్ పటేల్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ