ప్రోకబడ్డీ లీగ్ ఏడవ సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ వరుసగా మూడు విజయాలు నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆకట్టుకునే ఆట తీరుతో జైపూర్ 37-21 తేడాతో హరియాణా స్టీలర్స్ పై విజయం సాధించింది. కెప్టెన్ దీపక్ హుడా మరోసారి 14 పాయింట్స్ తెచ్చి సూపర్-10 సాధించాడు, ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం మొదలు పెట్టిన జైపూర్ పింక్ పాంథర్స్ కెప్టెన్ దీపక్ హుడా అద్భుతంగా ఆడడంతో మొదట్లోనే 5-1 తో ప్రారంభించి, ఆట సగం పూర్తయ్యే సరికి 13-8 తేడాతో ముందంజలో ఉంది. హరియాణా ఆటగాళ్లు తీవ్రంగా పోరాడిన పాయింట్స్ సాధించడంలో విఫలమయ్యారు.
విరామం అనంతరం ఆట మొదలైన వెంటనే హరియాణా స్టీలర్స్ ను పింక్ పాంథర్స్ ఆలౌట్ చేసింది, అదే ఊపుతో ఆడి మ్యాచ్ ముగిసే సమయానికి మరోసారి స్టీలర్స్ జట్టును ఆలౌట్ చేసి 37-21 తో ఘన విజయం సాధించింది. పింక్ పాంథర్స్ జట్టులో ట్యాక్లింగ్ లో సందీప్ ధూల్ 6 సార్లు సత్తాచాటాడు. హరియాణా స్టీలర్స్ జట్టులో వినయ్, సునీల్ చెరో 6 పాయింట్స్ తో ఆకట్టున్నారు. నిన్న జరిగిన మరో మ్యాచ్ లో యుముంబా పై యూపీ యోధ జట్టు విజయం సాధించి ఈ సీజన్ లో ఖాతా తెరిచింది.