తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1087 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 27, శనివారం నాటికీ మొత్తం కేసుల సంఖ్య 13436 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 3923 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ఆరుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 243 కి పెరిగినట్టు తెలిపారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 162 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4928 కి చేరింది. ప్రస్తుతం 8265 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu