దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. జూన్ 27, శనివారం నాడు కొత్తగా 3713 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా చెన్నై నగరంలో 1939 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78,335 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 51699 కేసులు నిర్ధారణ అయ్యాయి.
గత 24 గంటల్లో నమోదైన 68 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1025 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 2737 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 44094 కి చేరింది. ప్రస్తుతం 33213 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu