తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 127 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఇద్దరు ఉన్నారు. కొత్తగా నమోదైన 127 కేసులతో కలిపి జూన్ 3, బుధవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2572 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
కొత్తగా రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఏరియాలో 108 కేసులు, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలలో 6 చొప్పున, మేడ్చల్, సిరిసిల్ల జిల్లాలలో 2 చొప్పున, మహబూబ్నగర్, యాదాద్రి, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున మొత్తం 127 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 99 కి చేరినట్టు తెలిపారు.
ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 448 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఈ 448 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 3,020 కి చేరింది. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 1556 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1365 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu