తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 29, ఆదివారం నాటికీ 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణలో మూడు ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి లభించింది. ఇప్పటికే ఐదు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు ల్యాబ్ల్లో కరోనా పరీక్షలు చేస్తుండగా మరో మూడు కొత్త వాటికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 47 ప్రైవేటు ల్యాబ్లకు ఇప్పటివరకు అనుమతులు జారీ చేశారు.
కరోనా పరీక్షలు చేస్తున్న ప్రభుత్వ లేబొరేటరీలు:
- గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్
- ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్
- నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్
- సర్ రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్, హైదరాబాద్
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, హైదరాబాద్
కరోనా పరీక్షలకు కొత్తగా అనుమతి పొందిన ల్యాబ్ లు:
- అమెరికన్ ఇన్స్టిట్యూల్ ఆఫ్ పాథాలజీ & ల్యాబ్ సైన్సెస్, సిటిజన్ హాస్పిటల్ – శేరిలింగంపల్లి
- పాథ్కేర్ ల్యాబ్స్ – మేడ్చల్
- మెడిసిస్ పాథ్ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – న్యూ బోయినపల్లి
గతంలోనే అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్లు:
- అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్
- అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్ లిమిటెడ్, బోయిన్పల్లి
- విజయ డయాగ్నొస్టిక్స్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాయత్ నగర్
- డా.రెమిడీస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పంజాగుట్ట
- వింతా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చర్లపల్లి
[subscribe]