తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఒక్కరోజే 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 404కు చేరింది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మృతి చెందగా, 45 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 348మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే రాష్ట్రంలో గత మూడురోజుల్లోనే 130 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతూ పోతుంది. ఏప్రిల్ 8, బుధవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణ జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదయినట్టుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ వైరస్ వలన ఇప్పటికి నలుగురు మృతి చెందగా, మరో ఆరుగురు కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు ప్రకటించారు.
#CovidUpdates రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణ జిల్లా లో 6, చిత్తూరు లో 3 కేసు లు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 329 కి పెరిగింది#ApFightsCorona pic.twitter.com/v4z1d4TfYk
— ArogyaAndhra (@ArogyaAndhra) April 8, 2020
Media bulletin with district wise break up on status of positive cases of #COVID19 in Telangana (Dated: 07.04.2020) pic.twitter.com/OP0AbUMLIN
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 7, 2020