ప్రముఖ యువ నటుడు సాయిధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పటినుంచి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వర్గాలు శనివారం తాజా హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. “సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారు. ఆయనకు వెంటిలేటర్ ను తొలగించారు మరియు సొంతంగానే ఆయన శ్వాస తీసుకుంటున్నారు. మరికొద్దీ రోజులు ఆయన హాస్పిటల్ లోనే కొనసాగుతారు” అని బులెటిన్ లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ