తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్ రేపు (ఏప్రిల్ 17, శనివారం) జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రేపటి పోలింగ్ కు సంబంధించి ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో శానిటైజర్స్, మాస్కులు, పీపీఈ కిట్లు సహా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు.
ఇక ఈ రెండు చోట్ల అభ్యర్థులు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ లో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య కీలక పోటీ నెలకుంది. అలాగే తిరుపతిలో వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల తరపున విస్తృతమైన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ స్థానాల్లో రేపు పోలింగ్ జరగనుండగా, మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిన ఈ ఉపఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారో వేచిచూడాలి.
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక పోలింగ్ వివరాలు:
- బరిలో నిలిచిన అభ్యర్థులు: 28
- పోలింగ్ కేంద్రాలు : 2,410
- ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: 17,11,195
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ వివరాలు:
- బరిలో నిలిచిన అభ్యర్థులు: 41
- పోలింగ్ కేంద్రాలు : 346
- ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: 2,20,300
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ