ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, అలాగే రాష్ట్ర రాజధానిగా అమరావతి ప్రాంతంలో భూములను అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 12 నుంచి చేపట్టనున్న ‘మహా పాదయాత్ర’కు హైకోర్టు అనుమతిచ్చింది. ఏపీ డీజీపీ పాదయాత్రకు అనుమతిని నిరాకరించిన నేపథ్యంలో.. డీజీపీ ఉత్తర్వులపై కోర్టులో రైతులు పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతుల పిటీషన్ ను మొదటగా విచారించిన ధర్మాసనం పాదయాత్రకు అనుమతినిస్తూ కీలక తీర్పునిచ్చింది. అయితే పాదయాత్ర సందర్భంగా కొన్ని పరిమితులు విధించింది.
దీనికి లోబడి పాదయాత్ర కొనసాగించుకోవచ్చని సూచించింది. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే రైతులు చేసుకున్న ధరఖాస్తుని పరిశీలించి వారికి అనుమతినివ్వాలని ఆదేశించింది. కాగా దీనిపై తొలుత ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమతి నిరాకరించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు తలపెట్టిన పాదయాత్రలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే భయంతో అనుమతి ఇవ్వలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీ గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ అవ్వగా, అమరావతి పరిరక్షణ సమితి (ఏపీఎస్) ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావు ఉత్తర్వులు అందుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ