ఎమ్మెల్సీ కవిత గురించి తానెక్కడా తప్పుగా మాట్లాడలేదని, అలాగే తనను కించపరచలేదని కూడా స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ వ్యవహారంలో ఇప్పటికే నోటీసులు అందుకున్న ఆయన శనివారం బుద్ధ భవన్ లోని తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ లీగల్ సెల్ మహిళా న్యాయవాదులతో కలిసి కమిషన్ కార్యాలయానికి వచ్చిన సంజయ్, తాను ఏ సందర్భంలో ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు చేశారో, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో కమిషన్ సభ్యులకు వివరణ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకొని బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో ఏ తప్పూ చేయలేదని, అది నిరూపించుకొనేందుకే ఈరోజు మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యానని తెలిపారు. తెలంగాణ వ్యవహారిక భాషలోనే తాను మాట్లాడానని, అలాగే తెలంగాణ సమాజంలో సర్వసాధారణంగా వాడే ఒక సామెతను ఉదాహరించానని అన్నారు. అంతేకాని, తాను కవితను ఉద్దేశించి ఎక్కడా, ఎలాంటి వ్యక్తిగత దూషణలు కానీ, అసభ్యపదజాలం కానీ వాడలేదని స్పష్టం చేశారు. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కవిత ప్రమేయం ఉన్నందునే, ఆమె పేరు పదేపదే దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయని, ఆమెను అరెస్ట్ కూడా చేయొచ్చని వార్తలు కూడా వస్తున్నాయని తెలిపారు. వార్తా పేపర్లలో వచ్చిన వ్యాఖ్యలను బట్టే తాను కూడా అన్నానని, అయితే ఎక్కడా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బండి సంజయ్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE