2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం, కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలలో 2 హామీలు నెరవేర్చడం కూడా జరిగిపోయాయి. సీఎంగా రేవంత్ రెడ్డి అధికారాన్ని చేజిక్కించుకున్నా కూడా లోలోన ఒత్తిడితోనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు..బీఆర్ఎస్ నేతల్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడాది కూడా అధికారంలో ఉండలేదంటూ జోస్యాలు చెబుతూ వస్తున్నారు. ఏ ధైర్యంతో చెబుతున్నారో ఏ స్ట్రాటజీతో అలా చెబుతున్నారో కానీ రేవంత్ రెడ్డి గుండెళ్లో మాత్రం గుబులు మొదలయిందట..
ఇటు పదేపదే మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం..అటు సొంతపార్టీలోనే తనపై చాలామంది నేతలు గుర్రుగా ఉండటం రేవంత్కు పెద్ద తలనొప్పిగా తయారయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మాట అటుంచితే.. ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనే చర్చే రెండు రోజుల పాటు సాగింది. భట్టి, ఉత్తమ్ రేవంత్తో పోటీ పడుతూ ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడటం..అంతకు ఓ పది మంది నేతలు వరకూ అవకాశంవస్తే తామూ ముఖ్యమంత్రులం అవుతామని మనసులోని మాటను బయట పెట్టడం తెలిసిందే.
ఇలాంటివారందరితో రేవంత్ రెడ్డికి ఎప్పుడో ఒక రోజు, ఎక్కడో ఒక దగ్గర చిక్కు తప్పదు. మామూలుగా అయితే సీనియర్లు కావడం, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అపారమైన అనుభవం ఉండటం హస్తం పార్టీకి కలిసొచ్చే అంశమే. కానీ, రేవంత్ రాకను ఇష్టపడని వాళ్లతో పాటు.. టీడీపీ నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోవడంతో ఎన్నో ఏళ్లుగా హస్తం పార్టీలో ఉన్న నేతలకు రేవంత్ వైఖరి నచ్చడం లేదు. దీంతోనే రేవంత్ను బాహాటంగానే వ్యతిరేకిస్తూ ఉంటారు. వీరంతా ఏ క్షణమైనా రేవంత్కు ఝలక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.
అందుకే వీరిని నమ్ముకునే కంటే బీఆర్ఎస్లో గెలిచిన నేతలను నమ్ముకుంటే బెటరన్న లెక్కలు రేవంత్ రెడ్డి వేస్తున్నారట. ఎందుకంటే ఇప్పుడు హస్తం పార్టీకి భారీ మెజార్టీ ఏమీ రాలేదు.. జస్ట్ మ్యాజిక్ ఫిగర్ను దాటి 64 స్థానాలలో గెలుపొందింది. అసలే రాజకీయాలలో అపరచాణుక్యుడిగా పేరున్న కేసీఆర్..డబ్బుల సంచులను వెదజల్లి కొంతమంది ఎమ్మెల్యేలను కొనేసి.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందుకే గతంలో కేసీఆర్ చేసినట్లుగానే ఆయన బాటలోనే నడిచి కొంతమంది ఎమ్మెల్యేలను కొని పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని స్ట్రాంగ్ చేయాలని.. మెయిన్గా తన స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారట.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. ఒకటి,రెండు స్థానాలలో బీఆర్ఎస్ విజయం సాధించింది .ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే రేవంత్ రెడ్డి కొనడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారట. ఒకరిద్దరు నేతలు ఇప్పటికే రేవంత్కు టచ్లోనే ఉన్నట్లు ఇటీవల వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. ఆ ఎమ్మెల్యేలను కొంటే ఇక పూర్తి మెజారిటీతో బిందాస్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.
కేసీఆర్ మాత్రమే కాదు చంద్రబాబు కూడా వైసీపీలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలను కొన్నారు. కాకపోతే ఆయనకు ఫలితం దక్కలేదు అది వేరే విషయం .కాని ఇప్పుడు ఏడాదో రెండేళ్లో కాదు.. ఐదేళ్లు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉండాలని తీర్మానించుకున్నారట. లేదంటే సీఎం రేసులో భట్టి, ఉత్తమ్ వంటి నేతలు ఉన్నప్పుడు రెండేళ్లు, రెండున్నరేళ్లు అంటూ అధికారాన్ని పంచుకోవచ్చు. కానీ దానికి కూడా రేవంత్ సిద్ధపడలేదు. తానే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉండాలని నిర్ణయించుకుని అధిష్టానాన్ని కూడా ఒప్పించారు. అందుకే ఇప్పుడు ఎలాంటి చిన్న అవాంతరాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడటానికి ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ