బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 15వ తేదీన ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. అయితే తాజాగా మహిళా కమిషన్ నోటీసులపై బండి సంజయ్ స్పందిస్తూ, కమిషన్ సెక్రటరీకి లేఖ రాశారు. ప్రస్తుతం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున, ఒక ఎంపీగా న్యూఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉందన్నారు.
ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ సూచించిన విధంగా మార్చి 15వ తేదీ, ఉదయం 11 గంటలకు హాజరుకాలేనని చెప్పారు. కాగా మార్చి 15 కు బదులుగా మార్చి 18వ తేదీన కమిషన్ చెప్పిన ఏ సమయంలోనైనా వివరణ ఇచ్చేందుకు కమిషన్ ఎదుట హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. అలాగే తాను కమీషన్ ముందు హాజరు కావడానికి దారితీసే అవసరమైన మెటీరియల్ని, తాను హాజరు అయ్యే తేదీకి ముందే దయచేసి అందించాలని కోరారు. తద్వారా తాను వివరణ ఇచ్చేందుకు సులభం అవుతుందని బండి సంజయ్ మహిళా కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE