తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,646 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 2, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,69,407 కి పెరిగింది. అలాగే కరోనాతో మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,094 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక బుధవారం నాడు 88,206 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 3,603 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,30,648 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 34,665 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (2646):
- జీహెచ్ఎంసీ ఏరియా – 747
- మేడ్చల్ మల్కాజిగిరి – 177
- రంగారెడ్డి – 134
- హనుమకొండ – 114
- కరీంనగర్ – 102
- సిద్దిపేట – 87
- నల్గొండ – 86
- ఖమ్మం – 81
- మహబూబ్ నగర్ – 78
- సంగారెడ్డి – 74
- భద్రాద్రి కొత్తగూడెం – 71
- సూర్యాపేట – 69
- ఆదిలాబాద్ – 60
- యాదాద్రి భువనగిరి – 60
- మెదక్ – 58
- నిజామాబాద్ – 58
- మంచిర్యాల – 55
- పెద్దపల్లి – 51
- మహబూబాబాద్ – 48
- కామారెడ్డి – 44
- వికారాబాద్ – 44
- జనగామ – 43
- జగిత్యాల – 41
- వనపర్తి – 40
- రాజన్న సిరిసిల్ల – 38
- జయశంకర్ భూపాలపల్లి – 35
- వరంగల్ రూరల్ – 32
- నాగర్ కర్నూల్ – 26
- ములుగు – 23
- నారాయణ్ పేట్ – 20
- నిర్మల్ – 19
- కొమరం భీం ఆసిఫాబాద్ – 16
- జోగులాంబ గద్వాల్ – 15
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ