భారత్ బయోటెక్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా శుక్రవారం నాడు హైదరాబాద్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. కరోనా వైరస్ నివారణకు “కొవాగ్జిన్” పేరుతో భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశం సందర్భంగా కొవాగ్జిన్ వ్యాక్సిన్ యొక్క అభివృద్ధి, పురోగతిపై వివరాలను వెంకయ్య నాయుడు అడిగి తెలుసుకునట్టు తెలుస్తుంది. వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక గురించి కూడా చర్చించినట్టు సమాచారం. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ ప్రస్తుతం పేజ్-3 క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటుంది. మరోవైపు కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు భారత్ బయోటెక్ ఇటీవలే దరఖాస్తు చేసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ